న్యూయార్క్లోని పొమనాలో ఉన్న శ్రీరంగనాథ స్వామి దేవాలయంలో ఘనంగా ధనుర్మాసోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గోదాదేవిని, శ్రీరంగనాధస్వామిని వివిధ రూపాల్లో అలంకరించి భక్తులకు కనువిందు చేస్తున్నారు. వైకుంఠఏకాదశి ముందురోజున బుధవారంనాడు జనవరి 12వ తేదీన మోహినీ అలంకారములో గోదాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ రంగనాథస్వామి ముత్తాంగిగా కనువిందు చేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో శ్రీకృష్ణ దేశిక జీయర్ స్వామి ఆధ్వర్యంలో తిరుప్పావై పారాయణం జరిగింది. ఎంతోమంది భక్తులు ఈ ఉత్సవ వేడుకల్లో పాల్గొని తరించారు.
