Paramparaa – The Tradition Continues…

శ్రీరంగంలో తిరుపతి పండితులకు ఘనసత్కారం

తమిళనాడులోని శ్రీరంగంలో శ్రీ అహోబిలమఠం 46వ పీఠాధిపతి శ్రీవణ్‌ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామి వారి సప్తతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తిరుపతికి చెందిన ప్రముఖ పండితులను ఆచార్యుల వారి సమక్షంలో ఘనంగా సత్కరించారు.

   ఉ.వే. శ్రీ వేదాన్తం విష్ణుభట్టాచార్య స్వామికి వైఖానస  ఆగమ విద్వద్యుమణిః  బిరుదును, ఉ.వే. శ్రీ కె.ఎస్‌. రాజేశ్‌ కుమార్‌ (వేదిక్‌ యూనివర్సిటీ) స్వామికి పాంచరాత్ర ఆగమవిద్యద్యుమణిః  బిరుదును, ఉ.వే. శ్రీ టి.ఎస్‌. నారాయణాచార్య స్వామికి ఉభయమీమాంసారత్నం బిరుదును, ఉ.వే. శ్రీ ఎన్‌.ఆర్‌. సౌమ్యనారాయణన్‌ గారికి విద్యద్యుమణిః  బిరుదును, ఉ.వే. శ్రీ చక్రవర్తి రంగనాధన్‌ స్వామిని విద్యద్యుమణిః  బిరుదును ప్రదానం చేసి శాలువాతో వారిని ఘనంగా సత్కరించారు. ఈ సప్తతి ఉత్సవాల్లో సన్మానించబడిన 70మందిలో ఐదుగురు తిరుపతికి చెందినవారు ఉండటం విశేషం. తిరుపతి పండితులకు లభించిన సత్కారంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour