Paramparaa – The Tradition Continues…

తిరువాడిప్పూరం…తిరుమలనంబి ప్రత్యేకత

తిరువాడిప్పూరం…తిరుమలనంబి ప్రత్యేకత

తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి అభిషేకానికి తీర్థకైంకర్యం చేస్తున్న తిరుమలనంబికి, తిరువాడిప్పూరం ఉత్సవానికి ప్రత్యేక సంబంధం ఉంది. తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న పాదాలమంటపం వద్ద తిరుమలనంబి భగవద్రామానుజులవారికి రామాయణ కాలక్షేపం నిర్వహించారని, ఈ రామాయణ కాలక్షేపం వల్ల స్వామివారిని దర్శించుకోవడానికి సమయం లేకపోయిందని తిరుమలనంబి బాధపడుతున్న సమయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఈ మంటపంలోనే తిరుమలనంబికి సాక్షాత్కరించి ఆయన బాధను పోగొట్టారట.
తిరువాడిప్పూరం ఉత్సవసమయంలో ఈ పాదాలమంటపం వద్దకు శ్రీ గోవిందరాజ స్వామిని వేంచేయించి, తిరుమలనంబి వంశీయులకు మర్యాదను, అలాగే తిరుమలనంబి శిష్యులైన కైకాలరెడ్డి వంశీయులను టీటీడివారు సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. నిన్న జరిగిన తిరువాడిప్పూరం ఉత్సవంలో తిరుమలనంబి వంశీయులైన శ్రీ ఉ.వే. ముకుందన్‌ స్వామి ఈ మర్యాదను అందుకున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు చాలామంది ఈ పాదాలమండపం వద్ద శ్రీ వేంకటేశ్వరస్వామి పాదాలను నేటికీ దర్శించుకుని తరిస్తూ ఉంటారు.

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour