Paramparaa – The Tradition Continues…

ఘనంగా జరిగిన నావల్పాకం వాసుదేవాచార్య షష్ఠ్యబ్దపూర్తి మహోత్సవం

చెన్నైలో ప్రముఖ పండితులు శ్రీ నావల్పాకం శ్రీ వాసుదేవాచార్య షష్ఠ్యబ్దపూర్తి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో శ్రీ పౌండరీకపురం ఆండవన్‌ ఆశ్రమ పీఠాధిపతి శ్రీమద్‌ చిన్నఆండవన్‌ శ్రీ శ్రీనివాస గోపాల మహాదేశికన్‌ స్వామి, శ్రీరంగం శ్రీమద్‌ ఆండవన్‌ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ వరాహమహాదేశికన్‌ స్వామితోపాటు పలువురు పండితులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు అనుగ్రహభాషణం చేశారు. ఈ వేడుకల్లో శ్రీ ఉ.వే. యఙం స్వామి, శ్రీ ఉ.వే. నారాయణాచార్య స్వామి, శ్రీ ఉ.వే. ఓఆర్‌వి స్వామి, శ్రీ విఎస్‌వి స్వామి, శ్రీ ఉ.వే. రామాచార్య స్వామి, శ్రీ ఉ.వే. పద్మనాభాచార్య స్వామి, శ్రీ ఉ.వే. రంగనాధాచార్య స్వామి, శ్రీ ఇ.ఎస్‌. ముకుందన్‌ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ వాసుదేవం పేరుతో వెబ్‌ సైట్‌ ను కూడా ప్రారంభించారు. పలు పుస్తకాలను కూడా ఆవిష్కరించారు. శ్రీ దేశికస్తోత్రాలు, వాసుదేవాయధీమహి, దేవగురువు, శ్రీమద్‌ భాగవతరసం, ఐనమానగరిల్‌, శ్రీభాష్యసారం, తిరువాయిమొళి వ్యాఖ్యానం పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ వేడుకను ఏర్పాటు చేసిన గ్లోబల్‌ స్తోత్రపారాయణం కైంకర్యం నిర్వాహకులు శ్రీ పార్థసారథి స్వామి, వలంటీర్లు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు. చివరన శ్రీ వాసుదేవాచార్య మాట్లాడుతూ ఈ వేడుకలకు ఇంతమంది పండితులు, పీఠాధిపతులు రావడం చాలా సంతోషంగా ఉందని, భాగవతకైంకర్యం చేస్తూ ఉండాలన్నదే తన ఆశయమన్నారు. అందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour