Paramparaa – The Tradition Continues…

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కైశికద్వాదశి మహోత్సవం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి పర్వదినాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలనంబి వంశీయులు శ్రీమాన్‌ ఉ.వే. టి.కె. ముకుందన్‌ తాతాచార్య స్వామి కైశిక పురాణం చేస్తూ, కైశిక ద్వాదశి విశిష్టతను తెలియజేశారు. తరువాత ఆలయ మర్యాదలతో ఆయనను తిరుమలతిరుపతి దేవస్థానం అధికారులు ఇతరులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనను ఊరేగింపుగా తేరువీధిలో ఉన్న తోళప్పమండపం వరకు ఆలయ మర్యాదలతో తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో శ్రీమాన్‌ ఉ.వే. చక్రవర్తి రంగనాధన్‌, శ్రీమాన్‌ కంభరాజపురం […]

తిరుమలనంబి వంశీయులకు సత్కారం

రథసప్తమి సందర్భంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో తిరుమల నంబి వంశీయులకు టీటీడి వారు గౌరవమర్యాదలతో ఘనంగా సత్కరించారు. తిరుమలనంబి వంశీయులైన ఉ.వే. ముకుందన్‌ స్వామిని పూలమాలలతో ఘనంగా సత్కరించి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉ.వే. చక్రవర్తి రంగనాధన్‌గారు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా తిరుమలనంబి అవతార మహోత్సవం

తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి ఆధ్వర్యములో1050వ తిరుమల నంబి అవతార మహోత్సవములు తిరుమల దక్షిణ మాడవీధిలో ఉన్న తిరుమలనంబి ఆలయంలో ఘనంగా జరిగింది. తిరుమలనంబి వంశీయులు, ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్టు అధికారులు, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం అధ్యాపకులు, ప్రముఖ పండితులు హాజరయ్యారు. పండితులు ఈ సందర్భంగా చేసిన ఉపన్యాసాలు అందరినీ అలరించాయి. సంస్కృత విద్యాపీఠం ప్రొఫెసర్‌ ఉ.వే. చక్రవర్తి రంగనాధన్‌, తిరుమల నంబి వంశీయులు శ్రీ కణ్ణన్‌ ఆధ్వర్యంలో జరిగిన […]