Paramparaa – The Tradition Continues…

నెల్లూరులో 13 నుంచి ఆదివణ్‌ శఠగోప స్వామి, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో శ్రీమద్‌ ఆదివణ్‌ శఠగోప యతీర్రద స్వామికి, శ్రీ వేదాంత దేశికులవారికి ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సెప్టెంబర్‌ 13 నుంచి 25వ తేదీ వరకు శ్రీమద్‌ ఆదివణ్‌ శఠగోప స్వామికి ఆస్థాన ఉత్సవాలు జరుగుతాయి. స్వామి దేశికులవారి 755వ అవతార తిరునక్షత్రములో భాగంగా శ్రీమాన్‌ నేలటూరు (కొలాయి) రంగస్వామి స్మారకార్థం వారి కుమారులు శ్రీమాన్‌ నేలటూరు నారాయణన్‌ వారు శ్రీ […]

నెల్లూరులో యాళివాహనంపై కనువిందు చేసిన శ్రీ వేదాంత దేశికులు

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో ఆచార్య తిరునక్షత్ర మహోత్సవాలు, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 28వ తేదీ బుధవారంనాడు యాళివాహనంపై దేశికులవారు కనువిందు చేశారు. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్‌ కిడాంబి వేణుగోపాల్‌, శ్రీమాన్‌ రాజగోపాలన్‌, శ్రీమాన్‌ డా. అల్లాడి మోహన్‌, శ్రీమాన్‌ ఎ. విద్యాసాగర్‌, శ్రీమాన్‌ ధర్మవరం మధు, శ్రీమాన్‌ సుందర్‌ రాఘవన్‌ వ్యవహరించారు.

నెల్లూరులో హంస, సింహ వాహనంపై
కనువిందు చేసిన వేదాంత దేశికులు

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌ 26వ తేదీ సోమవారంనాడు శ్రీ వేదాంత దేశికులవారికి హంసవాహన ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్‌ కడాంబి సంపత్‌ గోపాలన్‌ వ్యవహరించారు. సెప్టెంబర్‌ 27వ తేదీ మంగళవారం సాయంత్రం సింహవాహనంపై శ్రీ దేశికులవారిని ఊరేగించారు. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్‌ కడాంబి క్రిష్ణస్వామి కుటుంబం వారు ఉన్నారు.ఈ కార్యక్రమంలో అర్చకులు విజయసారథి, […]

నెల్లూరులో 22 నుంచి ఆదివణ్‌ శఠగోప స్వామి, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు

నెల్లూరులో 22 నుంచి ఆదివణ్‌ శఠగోప స్వామి, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో శ్రీమద్‌ ఆదివణ్‌ శఠగోప యతీర్రదునికి, శ్రీ వేదాంత దేశికులవారికి ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సెప్టెంబర్‌ 22 నుంచి 30వ తేదీ వరకు శ్రీమద్‌ ఆదివణ్‌ శఠగోప స్వామికి ఆస్థాన ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ఉభయకర్తలుగా ఖతార్‌లో ఉంటున్న శ్రీమాన్‌ నారాయణన్‌, శ్రీమతి ఇందిర, […]

నెల్లూరు దేశికులవారి దేవాలయంలో తమిళ ఉగాది వేడుకలు

నెల్లూరులోని రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంతదేశికులవారి ఆలయంలో తమిళ ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష తిరుమంజనం ఇతర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. శుభకృత్‌ నామ సంవత్సరం అందరికీ శుభాన్ని కలగజేయాలని ఈ సందర్భంగా స్వామివారిని వేడుకున్నట్లు ఆలయ మేనేజింగ్‌ ట్రస్టీ కేసి వరదరాజన్‌ తదితరులు తెలిపారు.

దేశిక విజయం

శ్రీ వేదాంత దేశికులు అన్నీరంగాల్లో ప్రావీణ్యం సంపాదించడమే కాకుండా, వైష్ణవ సిద్ధాంతాన్ని అన్నింటా అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేశారు. మానవులను సన్మార్గంలో పయనింపజేయడానికి అనేక శాస్త్రాలను, గ్రంథాలను, స్తోత్రాలను రాయడమే కాకుండా, వితండవాడంతో, అహంకారంతో అసూయాద్వేషాలతో విర్రవీగే పండితులను తన వాదపటిమతో ఓడిరచారు. భగవద్‌ రామానుజులు బోధించిన విశిష్టాద్వైతాన్ని మరింతగా విస్తరించేందుకు దేశికులవారు కృషి చేశారు. అధ్యయనోత్సవం వివాదంశ్రీరంగంలో సంప్రదాయం ప్రకారం నిర్వహించే అధ్యయనోత్సవాన్ని అద్వైత పండితులు అడ్డుకున్నారు. అక్కడ పండితులు వృద్ధులైనందువల్ల వారితో వాదోపవాదనకు దిగలేకపోయారు. […]