నెల్లూరులో 13 నుంచి ఆదివణ్ శఠగోప స్వామి, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో శ్రీమద్ ఆదివణ్ శఠగోప యతీర్రద స్వామికి, శ్రీ వేదాంత దేశికులవారికి ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సెప్టెంబర్ 13 నుంచి 25వ తేదీ వరకు శ్రీమద్ ఆదివణ్ శఠగోప స్వామికి ఆస్థాన ఉత్సవాలు జరుగుతాయి. స్వామి దేశికులవారి 755వ అవతార తిరునక్షత్రములో భాగంగా శ్రీమాన్ నేలటూరు (కొలాయి) రంగస్వామి స్మారకార్థం వారి కుమారులు శ్రీమాన్ నేలటూరు నారాయణన్ వారు శ్రీ […]
అశ్వవాహనంపై విహరించిన వేదాంత దేశికులు

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 4వ తేదీన వేదాంత దేశికర్ స్వామి వారికి అశ్వవాహన సేవ జరిగింది. ఆలయ మేనేజింగ్ ట్రస్ట్ కేసీ వరదరాజన్ నేలటూరు బాలాజీ ,రమేష్ వరదరాజన్, రాజగోపాల్, నడదూరు కృష్ణమాచార్యులు పలువురు భక్తులు ఆలయ అర్చకులు విజయసారథి బట్టర్, విజయ రాఘవన్ బట్టర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఈ ఉత్సవంలో పలువురు పాల్గొన్నారు. అలాగే పేట ఉత్సవం, సేవ, శాత్తుమొర […]
గజవాహనంపై కనువిందు చేసిన కవితార్కిక సింహుడు

నెల్లూరు నగరం రంగనాయక పేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికర్ దేవస్థానం నందు దేశికులవారి తిరు నక్షత్ర మహోత్సవాల సందర్భంగా అక్టోబర్ 3వ తేదీన శ్రీ వేదాంత దేశికులకు గజవాహన సేవ నిర్వహించారు. వైభవంగా జరిగిన ఈ గజవాహన సేవలో పలువురు ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు. శ్రీమాన్ రాచపూడి వెంకట సుబ్బారావు, లలితమ్మ స్మారకార్థం రాచపూడి సూర్యనారాయణరావు, శ్రీమాన్ రాచపూడి మనోహర్ రావు ఉభయకర్తలుగా వ్యవహరించారు.ఈ కార్యక్రమం ఆలయ మేనేజింగ్ ట్రస్ట్ కేసి వరదరాజన్, రామదొరై, నేలటూరి […]
వైభవంగా జరిగిన ఆదివణ్ శఠగోపస్వామి తిరునక్షత్ర మహోత్సవం

నెల్లూరు నగరం రంగనాయక పేటలో వేంచేసియున్న శ్రీ వేదాంత దేశికర్ దేవస్థానం నందు అన్నమాచార్యుల గురువులు అహోబిల మఠం వ్యవస్థాపకులు ఆదివణ్ శఠగోప స్వామివారి స్వామి 654 వర్ష తిరునక్షత్ర మహోత్సవములు శనివారం ఘనంగా జరిగాయి. ఉదయం ఆదివన్ శఠగోప స్వామివారికి పల్లకి గొడుగులు ఉత్సవం, శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లకు శ్రీ ఆదివన్ శఠగోప స్వామి, వేదాంత దేశిక స్వామివార్లకు స్నపన తిరుమంజనం సాయంత్రం శేష వాహనంపై పేట ఉత్సవం […]
నెల్లూరులో ఘనంగా గరుడసేవ

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 30వ తేదీ శుక్రవారంనాడు శ్రీ వేంకటేశ్వర స్వామికి గరుడ సేవ ఉత్సవం వైభవంగా జరిగింది. శ్రీ వేదాంత దేశికులవారికి, శ్రీమద్ ఆదివణ్ శఠకోప స్వామికి తిరుచ్చి ఉత్సవం జరిగింది. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్ కొమండూరు శ్రవణ్కుమార్ వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ ట్రస్ట్ కేసి వరదరాజన్, నేలటూరు బాలాజీ, కే రామదొరై, రమేష్ పలువురు భక్తులు ప్రధాన […]
నెల్లూరు దేశికుల ఉత్సవాలు: వైభవంగా నాచ్చియార్ తిరుక్కోలం ఉత్సవం

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 29వ తేదీ గురువారంనాడు ఉదయం 8 గంటలకు నాచ్చియార్ తిరుక్కోలం ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్ ఉ.వే. వి.ఎస్. రాఘవన్ స్వామి స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు, శ్రీమాన్ వెంకట రాఘవన్ (హైదరాబాద్), శ్రీమాన్ కోదండ రామన్ (ఖతార్) వ్యవహరించారు. సాయంత్రం శ్రీ వేదాంతదేశికులవారికి, శ్రీ ఆదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశికన్ స్వామికి ఊంజలసేవ […]
నెల్లూరులో యాళివాహనంపై కనువిందు చేసిన శ్రీ వేదాంత దేశికులు

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో ఆచార్య తిరునక్షత్ర మహోత్సవాలు, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్ 28వ తేదీ బుధవారంనాడు యాళివాహనంపై దేశికులవారు కనువిందు చేశారు. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్ కిడాంబి వేణుగోపాల్, శ్రీమాన్ రాజగోపాలన్, శ్రీమాన్ డా. అల్లాడి మోహన్, శ్రీమాన్ ఎ. విద్యాసాగర్, శ్రీమాన్ ధర్మవరం మధు, శ్రీమాన్ సుందర్ రాఘవన్ వ్యవహరించారు.
నెల్లూరులో హంస, సింహ వాహనంపై
కనువిందు చేసిన వేదాంత దేశికులు

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 26వ తేదీ సోమవారంనాడు శ్రీ వేదాంత దేశికులవారికి హంసవాహన ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్ కడాంబి సంపత్ గోపాలన్ వ్యవహరించారు. సెప్టెంబర్ 27వ తేదీ మంగళవారం సాయంత్రం సింహవాహనంపై శ్రీ దేశికులవారిని ఊరేగించారు. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్ కడాంబి క్రిష్ణస్వామి కుటుంబం వారు ఉన్నారు.ఈ కార్యక్రమంలో అర్చకులు విజయసారథి, […]
నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన ఆదివణ్ శఠగోప యతీంద్రుల ఉత్సవాలు

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో అహోబిలమఠం వ్యవస్థాపకులు శ్రీమద్ ఆదివణ్ శఠగోప స్వామి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఆలయ మేనెజింగ్ ట్రస్టీలు, సభ్యులు, అర్చకులు, పెద్దలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అందరూ ఈ ఉత్సవాలకు వచ్చి ఆచార్యులవారి కరుణ కటాక్షాలను పొందాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.
నెల్లూరులో 22 నుంచి ఆదివణ్ శఠగోప స్వామి, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు

నెల్లూరులో 22 నుంచి ఆదివణ్ శఠగోప స్వామి, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో శ్రీమద్ ఆదివణ్ శఠగోప యతీర్రదునికి, శ్రీ వేదాంత దేశికులవారికి ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సెప్టెంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు శ్రీమద్ ఆదివణ్ శఠగోప స్వామికి ఆస్థాన ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ఉభయకర్తలుగా ఖతార్లో ఉంటున్న శ్రీమాన్ నారాయణన్, శ్రీమతి ఇందిర, […]