కారడయార్ వ్రతమ్ (సావిత్రి నోము వ్రతం)

కారడయార్ వ్రతమ్ (సావిత్రి నోము వ్రతం) మార్చి(2022) నెల 14వ తేదీ సోమవారం మన సంస్కృతిలో ఎన్నో పండుగలు, ఆచారాలు, సంప్రదాయాలు కనిపిస్తాయి. ఒక్కో పండుగ, ఆచారం వెనుక మన సంక్షేమం కనిపిస్తుంటుంది. అలాగే వివాహిత మహిళలు తమ భర్త క్షేమాన్ని కాంక్షిస్తూ ఓ వ్రతాన్ని ఆచరిస్తారు. అదే కారడయార్ వ్రతమ్, ’సావిత్రి నోము వ్రతం’ అని కూడా పేర్కొంటారు. ఈ వ్రతం వివాహిత మహిళలకు ముఖ్యమైన పండుగ. ఈ రోజున, మహిళలు తమ భర్తల దీర్ఘాయువు […]
అహోబిలమఠం యుఎస్ఎ ఆధ్వర్యంలో ఘనంగా అధ్యయనోత్సవాలు

అహోబిలమఠం యుఎస్ఎ ఆధ్వర్యంలో అధ్యయనోత్సవాలను టెక్సాస్లోని శ్రీ గురువాయూరప్పన్ దేవాలయంలో డిసెంబర్ 22 నుంచి 31వ తేదీ వరకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నవనీత కృష్ణునికి వివిధ అలంకరణలు చేసి పూజా కార్యక్రమాలు చేశారు. గరుడవాహనంపై ఉన్న శ్రీకృష్ణుడిని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఈ సందర్భంగా ప్రబంధ పండితులు ఆళ్వారులు అనుగ్రహించిన నాలాయిర దివ్య ప్రబంధాన్ని సేవించారు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.
పాదుకా సేవకులు … కవితార్కిక సింహులు

‘నభస్యమాసి శ్రోణాయాం అనంతార్య గురూద్భవమ్। శ్రీ వేంకటేశ ఘంటాంశం వేదాంతగురుమాశ్రయే ॥ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీనివాసుని దివ్యఘంటావతారంగా అనంత సూరి సుతునిగా ప్రసిద్ధిగాంచిన వేదాంత దేశికులను నేను ఆశ్రయిస్తున్నాను.’ వేంకటేశావతారోయం తత్ఘంటాంశోథవాభవేత్। యతీంద్రాంశోధవేత్యేవం వితర్క్యాయాస్తుమంగళం॥ శ్రీ దేశిక తనయ కుమారవరదాచార్యుల శ్రీసూక్త్యనుసారం ‘శ్రీ వేంకటేశ్వరులు, ఆయన ఘంట మరియు భగవత్ రామానుజులు’ ఈ మువ్వురి అవతారమే వేదాంతదేశికావతారం అని సుస్పష్టంగా తెలుస్తోంది. శ్రీ వేంకటేశ సుప్రభాత రచయిత, శ్రీవేదాంతదేశికుల నుండి ‘ప్రతివాదిభయంకర’ అనే బిరుదును స్వీకరించిన ప్రతివాది […]
సంప్రదాయ భోజన విధి

మన సంప్రదాయంలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అందులో భోజన విధానం ఒకటి. భోజనం చేసే ముందు. చేసే సమయంలో, చేసిన తరువాత ఎలా వ్యవహరించాలో శాస్త్రంలో పేర్కొన్నారు. మనం భోజనం చేసేటప్పుడు పంచభూతాలను, భగవంతుడిని సంతృప్తిపరిచి మనం భుజించాలని చెబుతారు. భోజన విధానంలో పేర్కొన్న విషయాలు మొత్తంగా 20 ఉన్నాయి. అందులో భోజనానికి ముందు 8 విధానాలను పాటించాలి. అందులో మొదటిది1) అతిధిరాకకోసం చూడటం – గృహస్థ ధర్మం ప్రకారము, తాను భుజించుటకు ముందు ప్రతిరోజు ఎవరైన అతిథి వస్తారా అని ఎదురు చూసి భోజనం చేయవలెను.2) ఆచమనం – భోజనమునకు ముందుగా […]
మహాభక్తుడు పోతన

పదునైదవ శతాబ్ధమున తెలుగు సాహిత్యాకాశమున దేదీప్యమానముగా సూర్యునివలె వెలిగినవాడు శ్రీనాథ మహాకవి. ఉత్తరార్థమున చల్లని వెన్నెలలు విరియించిన చంద్రునివంటి వాడు పోతన. పోతన మహాభక్తుడు. కవిత్వ పాండిత్యము ఆయనను సహజముగా వరించినవి. రాజాశ్రయమునకు దూరంగా ఉండి సాధారణ కర్షక జీవితము అవలంబించి తెలుగునాట భాగవత కల్పతరువును నాటిన మహాకవి పోతన. తెలుగుజాతికి తెలుగు కవిత్వమునకు సుకృతము పంటలాగా పోతన కవిత్వాలు నిలిచాయి. ప్రాచీన సాహిత్యమంతటిలో రెండే రెండు కృతులు పేర్కొనవలసి వచ్చినచో ఒకటి కవిత్రయము వారి భారతము, […]