Paramparaa – The Tradition Continues…

దేశికుల వారి సన్నిధికి వేంచేసిన గోవిందరాజస్వామి

తిరుపతిలోని శ్రీ వేదాంత దేశికులవారి సన్నిధిలో జరుగుతున్న 755వ తిరునక్షత్రం వేడుకల్లో భాగంగా చివరిరోజున శ్రీ దేశికులవారి సన్నిధికి శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ గోవిందరాజస్వామి వేంచేశారు. ఈ సందర్భంగా గోవిందరాజస్వామివారి మాలలను దేశికులవారికి అలంకరించిన తరువాత హారతి గోష్టి జరిగింది. ఈ సందర్భంగా శ్రీమాన్‌ కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్‌ స్వామి శిష్యులు దివ్య ప్రబంధ సేవాకాలం, వేద శాత్తుమొరై జరిపారు. ఈ కార్యక్రమంలో టీటిడి అధికారులతోపాటు భక్తులు పాల్గొన్నారు.

ఘనంగా ముగిసిన ఆదివణ్‌ శఠగోప ఉత్సవాలు

తిరుపతిలోని శ్రీ అహోబిలమఠంలో మూడురోజులపాటు అక్టోబర్‌ 17 నుంచి 19వ తేదీవరకు జరిగిన శ్రీ ఆదివణ్‌ శఠగోప యతీంద్ర మహాదేశికుల వారి వార్షిక కేట్టై తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరిరోజున తిరువళ్ళూరు, తిరుపతి గోవిందరాజ స్వామి సన్నిధి, తిరుచానూరు పద్మావతి దేవాలయం నుంచి వచ్చిన మాలలను దివ్య ప్రబంధ, వేద పారాయణాల నడుమ శ్రీమత్‌ ఆదివణ్‌ శఠగోప యతీంద్రులవారికి సమర్పించారు. కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్‌ శిష్యులు దివ్య ప్రబంధ పారాయణ సేవలో పాల్గొన్నారు. వీరితోపాటు మఠం […]

ఘనంగా ఆదివణ్‌ శఠగోప యతీంద్ర మహాదేశికుల తిరునక్షత్ర ఉత్సవాలు

తిరుపతిలోని అహోబిలమఠంలో ఆదివణ్‌ శఠగోప యతీంద్ర మహాదేశికుల తిరునక్షత్ర ఉత్సవాల్లో భాగంగా 2వ రోజున దివ్య ప్రబంధపారాయణం, వేదపారాయణం వంటివి జరిగాయి. ఈ దివ్య ప్రబంధ సేవాకాలంలో శ్రీమాన్‌ కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్‌ శిష్యులు, ఇతరులు పాల్గొన్నారు. తరువాత శాత్తుమొరై, ప్రసాద వినియోగం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహుని, శ్రీ ఆదివణ్‌ శఠగోప యతీంద్ర మహాదేశికులవారిని దర్శించుకున్నారు.

18-10-23   తులా సంక్రమణ

అథ ,  ప్రాత: ,మాధ్యా హ్నికం , భగవరాధానం చ కృత్వా పాదౌ ప్రక్షాళ్య , ద్వి రాచమ్య ,  త్రి భి: ద ర్భై: కృతం పవిత్రం ధృత్వా త్రి: ప్రాణా నాయమ్య రెండు సార్లు ఆచమనం , మూడు సార్లు ప్రాణాయామం. మూడు దర్భలతో చేసిన పవిత్రము దరించి. అస్మత్‌  గురుభ్యో నమ: శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి! వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!! గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, […]

14-10 -2023. శనివారం  మహాళయ అమావాస్య

 అథ ,  ప్రాత: ,మాధ్యా హ్నికం , భగవరాధానం చ కృత్వా పాదౌ ప్రక్షాళ్య , ద్వి రాచమ్య ,  త్రి భి: ద ర్భై: కృతం పవిత్రం ధృత్వా త్రి: ప్రాణా నాయమ్య రెండు సార్లు ఆచమనం , మూడు సార్లు ప్రాణాయామం. మూడు దర్భలతో చేసిన పవిత్రము దరించి. అస్మత్‌  గురుభ్యో నమ: శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి! వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!! గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, […]

తిరుపతి శ్రీ దేశికులవారి ఉత్సవాలు 14 నుంచి ప్రారంభం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి గుడి వద్ద ఉన్న శ్రీ వేదాంత దేశికులవారి ఉత్సవాలు అక్టోబర్‌ 14 నుంచి ప్రారంభమవుతున్నాయి. 23వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. విశేషంగా జరిగే ఈ ఉత్సవాలను ఈసారి కూడా వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా దివ్య ప్రబంధ పారాయణం, వేద పారాయణం, స్తోత్రపఠనం వంటివి జరగనున్నాయి. కంభరాజపురం శ్రీ శేషాద్రి అయ్యంగార్‌ శిష్యులు ప్రతి సంవత్సరం ఈ దేశికులవారి ఉత్సవాల్లో ప్రబంధ పారాయణం చేస్తున్న సంగతి తెలిసిందే. […]

மணம் கமிழும் நவராத்திரி மகிமை

நவராத்திரியின் ஒன்பது அருமையான நாட்களை நினைவு கூற்ந்தால், மக்களுக்கு, குறிப்பாக பெண்களுக்கு கொலு தான் நினைவு வரும். அவர்கள் கொலுவை சிறப்பாக ஒவ்வொரு வருடமும் வைத்து மகிழ்வதை பார்த்தால் நமக்கு அது சுலபமாக தெரியும். ஆனால் அதற்கு அவர்கள் படும் பாடு சொல்லி மாளாது. ஒரு அலுவுலக வேலையை விட கடுமையானது. அதை நாமும் கீழ்கண்டவாறு பார்ப்போமா? :- வழக்கம் போல இந்த வருடமும் கொலு நெருங்கி விட்டது. ஆனால் பிரச்சனை என்னவென்றால் ஆட்களை வேலைக்கு அழைத்தால், […]