Paramparaa – The Tradition Continues…

రంగనాధన్‌ స్వామికి ద్రావిడామ్నాయ పరిచర్యా నిరతః అవార్డు

తిరుమల తిరుపతిలో దివ్య ప్రబంధ కైంకర్యం చేస్తూ, వివిధ చోట్ల జరిగే గోష్టులకు హాజరవుతూ, మరోవైపు ప్రవచనాలు చేస్తూ, పరంపరా.ఇన్‌ (paramparaa.in) వెబ్‌ సైట్‌ ద్వారా ఎంతోమందికి దివ్య ప్రబంధాలను నేర్పిస్తున్న డా. చక్రవర్తి రంగనాధన్‌ స్వామికి చెన్నైలో జరిగిన ఏకదిన ప్రబంధ గోష్టిలో సన్మానం చేయడంతోపాటు  ద్రావిడామ్నాయ పరిచర్యా నిరతః అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతిలో శ్రీ రంగనాధన్‌ స్వామి చేస్తున్న కైంకర్యాన్ని అందరూ ప్రశంసించారు. 

16-07-2024  మంగళవారము కటక సంక్రమణం

శ్రీ మతే రామానుజాయ నమః:: శ్రీ మతేనిగమాంతమహాదేశికాయనమః శ్రీ వేంకటచలాధీశం శ్రియాధ్యా సితవక్షసమ్| శ్రిత చేతన మందారం శ్రీనివాస మహం భజే|| ఫాల్గుణే మాసి పూర్ణా యాం ఉత్తర క్షేన్దువా సరే | గోవింద రాజో భగవాన్ ప్రాదురాసేత్ మహామునే :                        పితృ తర్పణ మహిమ ధన్యం యశశ్యం ఆయష్యం స్వర్గ్యాం  శత్రు వినాశనం! కుల సంధారకం చేతి శ్రార్ద మాహూర్‌ మనీ షిణ : !! అర్ధం : మహిమ కల ఈ  పితృ […]

ఘనంగా ముగిసిన శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు

తిరుపతిలోని శ్రీ వేదాంత దేశికుల వారి 755వ తిరునక్షత్రం వేడుకలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా పదిరోజులపాటు దేశికులవారికి వివిధ అలంకారాలను చేయడంతోపాటు దివ్య ప్రబంధ పారాయణం, వేద శాత్తుమొరై నిర్వహించారు. చివరిరోజున శ్రీ గోవిందరాజస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతుడై దేశికులవారి సన్నిధికి వేంచేసి దేశికులవారితోపాటు భక్తులను అనుగ్రహించారు. కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్‌ శిష్యులు, ఇతరులు టీటిడి అధికారులు భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.

తిరుపతి శ్రీ దేశికులవారి ఉత్సవాలు 14 నుంచి ప్రారంభం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి గుడి వద్ద ఉన్న శ్రీ వేదాంత దేశికులవారి ఉత్సవాలు అక్టోబర్‌ 14 నుంచి ప్రారంభమవుతున్నాయి. 23వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. విశేషంగా జరిగే ఈ ఉత్సవాలను ఈసారి కూడా వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా దివ్య ప్రబంధ పారాయణం, వేద పారాయణం, స్తోత్రపఠనం వంటివి జరగనున్నాయి. కంభరాజపురం శ్రీ శేషాద్రి అయ్యంగార్‌ శిష్యులు ప్రతి సంవత్సరం ఈ దేశికులవారి ఉత్సవాల్లో ప్రబంధ పారాయణం చేస్తున్న సంగతి తెలిసిందే. […]

నెల్లూరులొ ఘనంగా వేదాంత దేశికర్ తిరు నక్షత్ర మహోత్సవం

నెల్లూరు రంగనాయక పేట వేదాంత దేశికర్ దేవస్థానంలొ వేంచేసి ఉన్న శ్రీ స్వామి వారి 755వార్షిక తిరు నక్షత్ర మహోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం సుప్రభాత సేవ 7 గంటలకుస్వామివారికి శ్వేత చత్ర  పల్లకీ ఉత్సవం, పినాకినీ నది తీర్ధ స్నపన తిరుమంజనం జరిగింది. సాయంత్రం 5గంటలకుశేషవాహనంపై శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి , పల్లకి పై వేదాంత దేశికర్ స్వామి వారికి రంగనాయకులపేట ఉత్సవం తదుపరి సేవా ,శాత్తుమోరై  తీర్థ ప్రసాదగోష్టి […]

తిరుమల బ్రహ్మోత్సవాలు…దివ్యప్రబంధ గానం

కలియుగ వైకుంఠం తిరుమలలో బ్రహ్మోత్సవాల వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల సందర్భంగా 10 రోజులపాటు శ్రీ వేంకటేశ్వర స్వామివారు వివిధ వాహనాలపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేయనున్నారు. ఈ వాహన సేవల సమయంలో ఆళ్వారులు అనుగ్రహించిన దివ్య ప్రబంధాన్ని పారాయణం చేయనున్నారు. ఏ ఏ వాహనసేవల్లో ఏ ఆళ్వారులు అనుగ్రహించిన ప్రబంధాన్ని గానం చేస్తారన్న విషయంపై తిరుపతి పండితులు, ఉ.వే. చక్రవర్తి రంగనాధన్‌ స్వామి పరంపర భాగవతోత్తములకోసం తమ వ్యాఖ్యానం ద్వారా అందించారు.బ్రహ్మోత్సవాల్లో […]

నెల్లూరులో 13 నుంచి ఆదివణ్‌ శఠగోప స్వామి, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో శ్రీమద్‌ ఆదివణ్‌ శఠగోప యతీర్రద స్వామికి, శ్రీ వేదాంత దేశికులవారికి ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సెప్టెంబర్‌ 13 నుంచి 25వ తేదీ వరకు శ్రీమద్‌ ఆదివణ్‌ శఠగోప స్వామికి ఆస్థాన ఉత్సవాలు జరుగుతాయి. స్వామి దేశికులవారి 755వ అవతార తిరునక్షత్రములో భాగంగా శ్రీమాన్‌ నేలటూరు (కొలాయి) రంగస్వామి స్మారకార్థం వారి కుమారులు శ్రీమాన్‌ నేలటూరు నారాయణన్‌ వారు శ్రీ […]

  శ్రీజయంతి ( జన్మాష్టమి) తిరువారాధనం

  శ్రీజయంతి ( జన్మాష్టమి) తిరువారాధనం మరియు నియమములు                              మునిత్రయ సంప్రదాయం: 1. శ్రీ జయంతి రోజు పూర్తిగా ఉపవాసము చేయవలెను. 2. అట్లు కానియెడల రాత్రి తిరువారాధనం చేయు వరకు ఉపవాసముండి, తిరువారాధనము చేసిన తరువాత స్వామికి   నైవేధ్యం సమర్పించిన తరువాత   వెన్న, పాలు, మొదలగునవి స్వీకరించ వచ్చును. 3. అదియు కానిచో  పగటి పూట ఏకాదశి వలే పలహార వ్రతం చేయ వచ్చును. 4. ఎటు వంటి కారణము చేతను అన్న ప్రసాదము […]